కాపులకు సీఎం జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: దోమకొండ అశోక్

కాపులు అమ్ముడుపోతారంటు కించపరిచే విధంగా మాట్లాడిన సీఎం జగన్ రెడ్డి వారికి క్షమాపణలు చెప్పాలని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ డిమాండ్ చేసారు.

అశోక్ మాట్లాడుతూ కాపులను కించపరుస్తూ ఉంటే ఎస్సీ వర్గానికి చెందిన యువకుడిగా నాకే కోపం వస్తుంటే వేదిక పైన ఉన్న కాపు వైసీపీ నాయకులకు పౌరుషం లేదా అని జనసేన పార్టీ నాయకులు అశోక్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు అనగారిన వర్గాల వారిని కించ పరచడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమా?.. అనగారిన వర్గాల వారు అందరు ఒక తాటిపైకి వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి. అన్ని వర్గాల వారు ఒకటిగా పోరాడే సమయం ఆసన్నమైంది అని, 2024 వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే నాయకులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వవలసినదిగా అశోక్ కోరారు.