నేడు నిజామాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ బుధవారం నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఇటీవల అనారోగ్యంతో గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్నుమూశారు. కాగా, గణేశ్‌ గుప్త తండ్రి ద్వాదశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:30గంటలకు సీఎం మాక్లూర్‌ చేరుకుంటారు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత తిరుగు పయనమవుతారు.