అరుణ కుమారికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

*బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా సహాయం

సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొందిన పట్టుచీర్ల అరుణ కుమారికి రూ.26,218 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందజేశారు. ఈ సహాయం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫారసు మేరకు మంజూరైంది. చెక్కును అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన నేతలు ప్రజల సంక్షేమం పట్ల చూపుతున్న కృషి పట్ల హర్షం వ్యక్తమైంది.

Share this content:

Post Comment