లాలాచెరువులో సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

*బాధితుడికి ₹40,000 సాయం

రాజానగరం మండలం లాలాచెరువు (హౌసింగ్ బోర్డు) గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొందిన దొడ్డా వెంకట నాగ కృష్ణకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.40,000 విలువైన చెక్కును, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సిఫారసుతో జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందజేశారు. ఈ సహాయానికి కృతజ్ఞతగా బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment