ఆవిర్భావ దినోత్సవానికి ఉప్పెనలా తరలి రండి అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు – మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులు ఉప్పెనలా తరలి రావాలని కోరారు. తణుకు నియోజకవర్గం జనసైనికులతో అత్తిలిలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సన్నాహ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి జనసైనికుడు ఓ సైనికుడిలా పనిచేయాలి అని సూచిస్తూ, ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఏర్పాట్లు: తనుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి, బ్రహ్మాండమైన జన సమీకరణ చేపట్టాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవానికి హాజరయ్యే జనసైనికుల కోసం ప్రత్యేక బస్సులు, కార్లు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. మార్గమధ్యంలో మంచినీరు, ఆహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. బస్సు లేదా కార్లు అవసరమైన ప్రాంతాలను ముందుగా తెలియజేస్తే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్వయంగా వాహనాలు అందించేందుకు ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:
Post Comment