కమెడియన్స్ గెట్ టుగెదర్.. పిక్ వైరల్!

టాలీవుడ్లో యంగ్ కమెడియన్లుగా కొనసాగుతున్నవారు ఒక్కచోట చేరారు! ప్రతీ ఏడాది గెట్ టుగెదర్ కార్యక్రమంలో భాగంగా కలుసుకునే వీరంతా మరోసారి మీటయ్యారు. ఈ మీట్ లో మొత్తం 11 మంది కమెడియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటోను స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. తామంతా కలిసి దాదాపు ఏడాది గడిచిందని రాసుకొచ్చాడు కిషోర్. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. నెటిజన్లను కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

‘కమెడియన్లంతా ఒకే చోట చేరడం బాగుంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈ పదకొండు మంది కలిసి పరమానంద శిష్యుల కథ సినిమాను మళ్లీ తీస్తే చాలా బాగుంటుంది’ అని మరొకరు కామెంట్ చేశారు.