నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు

నిడదవోలు, వైసీపీ శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై సాక్షాత్తు అసెంబ్లీ ఆవరణలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లో నిడదవోలు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, ఉపాధ్యక్షులు వాకా ఇంద్రగౌడ్, మేడా పూర్ణ, జనసేన నాయకులు ఎండీ అక్రమ్, ఈతకోట యోహాను, ఉప్పులూరి రామ్మోహన్రావు, కారింకి వరప్రసాద్, కస్తూరి సుబ్బారావు, వడ్డిరెడ్డి గణపతిరాజు, పెండ్యాల శ్రీను, సుధా మణికంఠ, వివిధ గ్రామాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-05-at-2.22.13-PM-1024x768 నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు

Share this content:

Post Comment