బోలె నరసింహారావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

అశ్వరావుపేట, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంకు సంబంధించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తాళ్లూరి రామ్, రాధారం రాజలింగం, దుంపటి శ్రీనివాస్ ఇతర నాయకుల ఆదేశాల మేరకు సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డేగల రామచంద్రరావు ఆదేశాల మేరకు జనసేన పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు పసుపులేటి కిషోర్ నాయుడు మరియు ఉపాధ్యక్షులు బోలె నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైకి పిర్యాదు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ప్రెసిడెంట్ పసుపులేటి కిషోర్ నాయుడు ఉపాధ్యక్షులు బోలే నరసింహారావు మరియు ప్రధాన కార్యదర్శి ధర్మసోత్ శివాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.