డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

అశ్వరావుపేట, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంకు సంబంధించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తాళ్లూరి రామ్, రాధారం రాజలింగం, దుంపటి శ్రీనివాస్ ఇతర నాయకుల ఆదేశాల మేరకు సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్సైకి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ప్రెసిడెంట్ ఇస్లాం వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లం రామకృష్ణ, కురిసెట్టి నాగబాబు నాయుడు, మంగ దొడ్డి ఆనంద్ కుమార్, బద్దిరెడ్డి రాజేష్ సాయి తేజ దుర్గా ప్రసాద్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.