పంటకాలువల పూడికతీత పనులు పూర్తి చేయండి: ఇంటిపల్లి ఆనందరాజు

కోనసీమ జిల్లా: రాజోలు మండలంలోని పంటకాలువలలో గత రెండు సంవత్సరాలుగా పూడిక తీయడంలేదని రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు తెలియజేసారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఏఈ ఈశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. 2022-23 సంవత్సరానికిగానూ సార్వా పనులకు ముందు లేదా వర్షాలకు ముందే పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి, మెరకపాలెం ఎంపీటీసీ పున్నం నాగదుర్గ పాల్గొన్నారు.