క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి జనసేన చేయూత..

  • కార్యకర్త మణికంఠ కుటుంబానికి లక్షల రూపాయల బీమా చెక్కు అందజేసిన డా. పసుపులేటి హరిప్రసాద్

నగరి నియోజకవర్గంలోని పాదిరి గ్రామానికికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త మణికంఠ అకస్మాత్తుగా మరణించడంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, మణికంఠ క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్నందున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ద్వారా ఆ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ మణికంఠ పిల్లలకు మరియు కుటుంబ సభ్యులకు ఆరోగ్య రీత్యా ఎలాంటి అవసరాలు ఉన్నా మేము ఉన్నాము అని తెలిపారు. వారి పిల్లల విద్యకు అయ్యే ఖర్చు మేము సహాయం చేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, జిల్లా అధికార ప్రతినిధి మెరుపుల మహేష్, జిల్లా కమిటీ సభ్యులు పి.ఆనంద్, స్వామినాథన్, జి.డి నెల్లూరు ఇంఛార్జి యుగంధర్, పీలేరు నియోజకవర్గం దినేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, సామాజిక వేత్త కరుణానిధి, నిండ్ర మండల అధ్యక్షుడు శివలింగం, జగదీష్ రాజు, దేవ, జనసేన వీరమహిళ శ్రీమతి రాధమ్మ మరియు మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు వీరమహిళలలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.