దూదేకుల శ్రీనుకు అభినందనలు

గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కమిటీ మెంబర్ గా ఎన్నికైన దూదేకుల శ్రీనుకు గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా మాట్లాడుతూ.. జనసేన పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, పార్టీలో స్థానం దొరుకుతుందని అనటానికి ఇదే నిదర్శనం అని అన్నారు. దుదేకుల శ్రీను మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సభలు గుంటూరు జిల్లాలో ఎక్కడ నిర్వహించినా.. నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ముస్లిం మైనార్టీలకు అండగా ఉండే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఆయన అన్నారు. నన్ను నమ్మి ఈ కమిటీలో పదవి అందజేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు, కార్య నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణ శివ శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.