సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత గాదె పృథ్వి కి అభినందనలు

తెలంగాణ, జనసేనపార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా భయంకర కరోనా సమయంలో అధినేత పవన్ కళ్యాణ్ జనసేవ పిలుపుతో లాక్ డౌన్ సమయంలో దినసరి కూలీల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తూ, సుమారు 45 రోజులు వృద్ధులకు ఆహారం పంపిణీ చేసిన సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారు ‘సేవారత్న జాతీయ అవార్డు 2023’కు ఎంపిక చేసి ఆదివారం న్యూఢిల్లీలో 27 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్న బహుజన రైటర్స్ నాలుగవ జాతీయ సదస్సులో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ సేవారత్న అవార్డు అందుకున్న జనసేన నాయకులు గాదె పృథ్వికి హృదయపూర్వక అభినందనలు.