వారాహి యాత్ర జయప్రదం కావాలని తలనీలాల సమమర్పణ

అమలాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ నెలలో చేపట్టిన వారాహి యాత్ర జయప్రదం కావాలని, అలాగే ఆయన ఇంటికి క్షేమంగా చేరాలని జూన్ 14వ తారీఖున చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో మరియు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు తలనీలాలు 11 కొబ్బరికాయలు మొక్కుకున్నారు. ఆ మొక్కులను శనివారం ద్వారకాతిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ మొక్కుబడులు తీర్చుకున్నారు.