భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కు హామీ యాత్రా కార్యక్రమం అగ్రహారపు సతీష్ ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు భవననిర్మాణ కార్మికులని కలిసి మాట్లాడుతూ ఏనాడైతే ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటినుండే నిర్మాణ రంగంలో చీకట్లు అలుముకున్నాయన్నారు. ప్రకృతి ప్రసాదించే ఇసుకని అడ్డం పెట్టుకుని కార్మికుల కడుపులు కొట్టింది ఈ ముఖ్యమంత్రి అని ఆరోపించారు. అందరికీ నీడనిచ్చే ఇల్లు కట్టే వీరికి సొంత నీడ నిచ్చే గూడు లేదనీ, అది తాము అందిస్తామన్నారు. అందుకే నేడు భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సంక్ష్యేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే మానిఫెస్టోలో రూపకల్పన చేసేలా తమ జనసేన తెలుగుదేశం పార్టీలు అడుగులు వేస్తున్నాయన్నారు. రాబేయే రోజులలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి మీయొక్క మద్దతుని ఇవ్వవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్, వాసు, నగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.