భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం తుమ్మలపల్లి సీతారాం ఆధ్వర్యంలో 44 వ డివిజన్ జి.పి.టి కాలేజ్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఏనాడైతే ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భవన నిర్మాణ కార్మికుల జీవితాలని అతలాకుతలం చేసిందన్నారు. అసలు నిర్మాణరంగం మొత్తం ఆధారపడే ఇసుకని అడ్డం పెట్టుకుని కార్మికుల కడుపు కొట్టి తద్వారా వారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే అదే ఇసుకతో తమ అక్రమ సంపాదనతో ఆకాశహర్మ్యాలు కట్టుకుని విలాసవంతంగా బతుకుతున్న నిరుపేద జగన్మోహన్ రెడ్డే దీనికి కారణమన్నారు. ఇంతజరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఈసమస్యపై స్పందించలేదనీ పైగా వారికి సంబంధించిన భవిష్యనిధికి సంబందించిన సొమ్ముని సైతం వాడేసుకున్నారని విన్నామన్నారు. దీనిపై ముందుగా తమ నాయకుడు పవన్ కళ్యాన్ గారు స్పందించి కవాతు కార్యక్రమాన్ని పెట్టి వారి తరపున పోరాటం చేసారని గుర్తుచేసారు. సాటి మనిషిగా తనవంతు సహాయాన్ని జనసేన పార్టీ ఆనాడు అందించిందనీ, భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సంక్ష్యేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల మానిఫెస్టోతో తమ జనసేన తెలుగుదేశం పార్టీలు తమ మానిఫెస్టోలో కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో తోరం చిరంజీవి, రావిపాటి వెంకటేశ్వరరావు, కైలాసం వెంకట ఆదినారాయణరావు, అడపా నరేష్ కుమార్, శెట్టి జోగిరాజు, సురకాసుల జయరాజు తదితరులు పాల్గొన్నారు.