నూకల రమేష్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం

రాజంపేట: జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు సూచనల మేరకు ఉమ్మడి కడపజిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలానికి చెందిన ప్రముఖ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ గ్రంధాలయ చైర్మన్ నూకల రమేష్ గారి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఉమ్మడి నిర్ణయంగా కోడూరు ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి గారు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు గారి ఆధ్వర్యంలో విజయానికి అందరం కలిసి మూకుమ్మడిగా కష్టపడతామని ఈ సమావేశంలో తీర్మానించారు. భవిష్యత్తులో ఏ కార్యక్రమం అయినా మేమంతా కలిసి మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్కా మదుసూదన రెడ్డి, కాటబత్తిన నరసమ్మ (మాజీ ఎం.పి.పి.పుల్లంపేట, మాజీ సర్పంచ్), కోనేరెడ్డి జయరామకృష్ణ రెడ్డి (అనంతంపల్లె సర్పంచ్), రాంపిచర్ల మురళి(మాజీ సర్పంచ్ రెడ్డిపల్లె), నూకల వెంకటేష్ (మాజీ సర్పంచ్, కొత్తపేట), కాట బత్తిన సుబ్బారాయుడు (మాజీ ఎం.పి.టి.సి.కొత్తపేట), గెండికోట రామకృష్ణ (మాజీ సర్పంచ్ పుత్తనవారిపల్లె, మండల బిజెపి ప్రెసిడెంట్), సిద్దవటం సుబ్బారాయుడు (మాజీ సర్పంచ్, వత్తలూరు) టిడిపి సీనియర్ నాయకులు సయ్యద్ నజీర్, పసుపులేటి సుబ్బరాయుడు, టిడిపి సీనియర్ నాయకులు బొమ్ము సుబ్బరాయుడు, టిడిపినాయకులు కాటబత్తిన ప్రసాద్ జనసేన నాయకులు వర్దన్నగారి ప్రసాద్, సంధా లక్ష్మీ నరసయ్య, పసుపులేటి రవి, బుశెట్టి సుందరరామయ్య, గాజుల సుబ్రమణ్యం, టిడిపి సీనియర్ నాయకులు వల్లపురెడ్డి చెన్నకేశవ రెడ్డి ఇంకా స్దానిక నేతలు మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.