ఎస్పీ బాలసుబ్రహ్మణ్యoకు కరోనా పాజిటివ్

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యిందట. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు ఓ వీడియో రూపంలో స్వయంగా అందరికి సమాచారం అందించారు.

కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వివరించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.