తెలంగాణలో కరోనా తీవ్రత.. ఒక్క‌రోజులో 8వేలకు పైగా కేసులు.. 38 మంది మృతి

తెలంగాణలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 8,126 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,307 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,95,232కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,30,304 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,999గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 62,929 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,259 మందికి క‌రోనా సోకింది.