సబితా ఇంద్రారెడ్డికి కరోనా వారియర్‌ అవార్డు

కరోనా వంటి కష్ట కాలంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు ధైర్యాన్ని నింపడంతో పాటు అండగా నిలిచిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అంతర్జాతీయ కరోనా వారియర్‌ అవార్డు లభించింది. సోమవారం మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోవిశ్వగురు వరల్డ్‌ రికార్డు సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు కరోనా వారియర్‌ అవార్డును మంత్రికి అందజేశారు.అనంతరం రాంబాబు మాట్లాడుతూ మంత్రి సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్‌ రికార్డు సంస్థ ఆమెకు కరోనా వారియర్‌ అవార్డును అందజేసినట్లు తెలిపారు.