జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యం

  • ఇంటింటికి కరపత్రాలను అందజేసిన జనసేన నాయకులు

రాజంపేట జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని రాజంపేట జనసేన పార్టీ నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 30 వ రోజు రాజంపేట నియోజకవర్గం పోలి పంచాయతీలోని శేషన్న గారి పల్లె, చిన్నులుగారి పల్లె, పోలి ఎస్సీ ఎస్టీ కాలనీ తదితర గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సిద్ధాంతాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ద్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలనను దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన యువ నాయకురాలు పోలిశెట్టి రజిత, భాస్కర్ పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, శంకరయ్య, గోపి, వీరయ్య ఆచారి, జడ్డా శిరీష, చంగల్ రాయుడు, కిషోర్, గోవర్ధన్ జనసేన పార్టీ నాయకులు, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.