పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన కౌన్సిలర్ శ్రీదేవి
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన పోటీల్లో సుభాష్ చంద్ర బోస్ పురపాలక ప్రాథమిక పాఠశాల (రాతిబడి)విద్యార్థులు ప్రతిభను చాటారు. పోటీల్లో నాలుగు ప్రధమ బహుమతులు సాధించిన అక్కా చెల్లెలు ప్రియాంక, నాగవల్లి లకు 4వ వార్డు జనసేన కౌన్సిలర్ పడాల శ్రీదేవి నానాజీ బహుమతులు ప్రధానం చేసారు. విజేతలు తల్లి తండ్రులు అంకం దేవిక నాగరాజు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు, ఉపాధ్యాయులను, పలువురు అభినందించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-16-at-11.47.42-AM-1024x473.jpeg)