నాదెండ్ల మనోహర్ తో కంబాలదాసు మర్యాదపూర్వక భేటీ

  • మత్స్యకారుల సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకెళ్ళిన కంబాలదాసు

పిఠాపురం: రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర మత్యకార వికాస విభాగం కార్యదర్శి కంబాలదాసు ఆధ్వర్యంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలసి పిఠాపురం నియోజకవర్గంసమస్యలను, నియోజకవర్గంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను, యూ కొత్తపల్లి మండలం మత్స్యకార గ్రామాలైన అమీనాబాద్, కోన పాప పేట, ఉప్పాడ, సుబ్బంపేట, కొత్తపేట, నాయకర్ కాలనీ లు తరచూ కోతకు గురవుతున్నటువంటి సముద్ర తీర ప్రాంతము మరియు తీర వెంబడి రక్షణ కోసం పక్కనే ఉన్న తొండంగి మండలంలో అరవింద్ ఫార్మసీ, ఇతర మత్స్యకార జీవనోపాధి సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ భేటీ లో వంకా కొండబాబు, పల్లేటిబాపన్నదొర, సోదే రవికుమార్, పల్లెటి జాన్సన్, మైలపల్లి రాజు, రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి ఆఫీస్ కి వెళ్లి కలవడం జరిగి విషయాలని చర్చించడం జరిగింది త్వరలోనే ఒక మంచి కార్యక్రమం సేకరించి పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది.