నష్టపోయిన రైతాంగానికి పంట నష్టం అందజేయాలి

వైజాగ్: ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుఫాన్ చేసిన బీభత్సవానికి నష్టపోయిన రైతాంగానికి పంట నష్టం కింద ప్రభుత్వం ద్వారా అందవలసిన సాయం తక్షణమే అందజేయాలని జనసేన పార్టీ నాయకులు మరియు కాపు సంక్షేమ సేన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు బసవ చిన్న బాబు, కాపు సంక్షేమ సేన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి గుర్రాల శ్రీనివాస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కరణం కళావతిల ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం కాపు సంక్షేమ సేన ఆనందపురం మండలం చందక గ్రామంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున రావలసిన నష్టపరిహారాన్ని వెంటనే అందేలా ప్రభుత్వానికి తెలియజేయటం జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు చేగొండి హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని వాళ్ళ పరిహారం అందించాలని రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది.