మహా పాదయాత్రకు జన నీరాజనం
రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, వెలమపేట గ్రామంలో జనంకోసం జనసేన – మహా పాదయాత్ర’ 14వ రోజు భాగంగా వెలమపేట గ్రామంలో కార్యక్రమానికి ప్రజల జననీరాజనంతో ముందుకు సాగింది. జనసేన నాయకులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన ఈ వైసీపీ సర్కార్ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన విధానాలు ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైలపూడి శ్రీను, సిరిపరపు రాంబాబు, శివ, చవితిన కిరణ్, చొక్కాకుల నారాయణ, పొదలపు రవీంద్ర, గడి దుర్గాప్రసాద్, గడి అప్పన్న, గడి వినోద్, బోల్లం శివ, ముత్యాల హరీష్, తోట సూర్యమణికంఠ, బడిరెడ్డి దుర్గా ప్రసాద్, హేమ మణికంఠ మరియు వీరమహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-5.36.12-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-5.36.14-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-5.36.13-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-5.36.12-PM-1-1024x460.jpeg)