“ఛలో పిఠాపురం” కార్యక్రమానికి బయలు దేరిన జనశ్రేణులు

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆహుడా చైర్మన్ టి.సి. వరుణ్ నేతృత్వంలో, సింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే మురళీకృష్ణ ఆధ్వర్యంలో “ఛలో పిఠాపురం” కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. నియోజకవర్గం నుండి ఒక బస్సు, నలుగు వాహనాల్లో అనేకమంది జనసైనికులు అనంతపురం గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు వద్ద నుంచి పిఠాపురం వైపు ప్రస్థానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు చొప్ప చంద్రశేఖర్, బొమ్మల పురుషోత్తం రెడ్డి, అలాగే మండల కన్వీనర్‌లు ఎర్రి స్వామి, కుళ్లాయప్ప, ఆదినారాయణ, చిన్న శ్రీరాములు, మధు, వినోదం, నారాయణస్వామి, లోకేష్, శివ, కుళ్లాయప్ప, నరేష్, సతీష్, ప్రవీణ్, నరేంద్ర, సోము, రాము తదితరులు పాల్గొన్నారు.నియోజకవర్గం అంతటినుండి జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పిఠాపురం వైపు ప్రస్థానం చేశారు.

Share this content:

Post Comment