సొంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేసిన సి.ఎస్ పురం జనసైనికులు

సి.ఎస్ పురం గ్రామం నుండి పొలాలకు వెళ్ళే పంచాయతీ రాజ్ రహదారి వర్షాలకు గోతులు పడి, కల్వర్ట్ విరిగి పోయి ప్రయాణం చేయడానికి వీలులేకుండా అద్వానంగా తరయారైంది. స్థానిక అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో, ప్రజల కోరిక మేరకు సి.ఎస్ పురం మండల జనసైనికులు సొంత నిధులతో కల్వర్ట్ నిర్మించి, గుంటలకు మరమ్మత్తులు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జానపాటి రాజశేఖర్, సుబ్బారాయుడు, ఊసా శ్రీను, రమేష్, చందు తదితరులు పాల్గొన్నారు.