ఊటుకూరు పరిధిలోని డి.బి.ఎన్. పల్లిలో వెలసిన శ్రీ మాతమ్మ తల్లి జాతరలో పాల్గొన్న అతికారి దినేష్

రాజంపేట మండలం ఊటుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెలసిన శ్రీ మాతమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ మొదట ఆలయ ధర్మకర్తలు గ్రామ పెద్దలు ఆయనకు ఆలయ మర్యాదలతో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. లోకకళ్యాణార్థం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా సాగుతున్న సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని డి.బి.ఎన్. పల్లి లోని శ్రీ సీతారాముల వారి, శ్రీ గంగమ్మ తల్లి, శ్రీ మాతమ్మ తల్లి ఆలయాలలో విశేష పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు ఆలయ విశిష్టతను వివరించి శాలువాతో సత్కరించడం జరిగింది. శ్రీ మాతమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా గ్రామంలో విద్యుత్ దీపాలంకరణ, పందిరి, మైక్ సెట్ అతికారి దినేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం డి.బి.ఎన్. పల్లి లోని అరుంధతి వాడ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సాంబ నివాసంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో అందరితో కలసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలాటం హరికృష్ణ, పోలిశెట్టి శీను, గుగ్గిళ్ళ నాగార్జున, ఉగ్రణం హేమంత్, కోండలగారి రవి, సునీల్, పెంచలయ్య, సాంబ తదితరులు పాల్గొన్నారు.