ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంపుపై బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్‌, జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయనుంది. సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం ప్రాన్‌ అకౌంట్‌కు జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామంది. 2019 జనవరి డీఏ 2021 జులై నుంచి.. 2019 జులై డీఏ.. 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ ఇచ్చింది