జిల్లా స్థాయి ఆటలపోటీల్లో ముఖ్య అతిధిగా దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజవర్గం, 64వ వార్డు గంగవరం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కు కబాడీ వాలీబాల్ త్రోబాల్, షటిల్, ఫుట్బాల్ క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా.. 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ కనబరచాలని భావితరాల భవిష్యత్ కి, క్రీడ ఉపయోగపడుతుందని, మన జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కబాడీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గ్రామం గంగవరం అని గంగవరం గ్రామంలో క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడుతూ.. అభినందించారు. నా వార్డు పరిధిలో అది నా గంగవరం గ్రామంలో ఈ పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని ఆయన కొనియాడారు. అనంతరం కార్పొరేటర్ గోవింద్ రెడ్డికి అందరూ ధన్యవాదాలు తెలియజేశారు. స్కూల్ గేమ్స్ డిస్టిస్ట్రిక్ట్ సెక్రెటరీ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచే వారిని జిల్లా స్థాయి టీంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ప్రియాంక రెడ్డి, స్కూల్ పీడీ భానుజి, విశాఖపట్నం జిల్లా ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు, స్కూల్ స్టాఫ్, స్కూల్ చైర్మన్ అమ్మోరు, స్కూల్ కమిటీ ధనరాజ్, అమ్మోరు, అప్పన్న, చోడి పిల్లి ముసలయ్య, మంగరాజు, లక్ష్మణ్, భూలోక, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.