అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి

గాజువాక నియోజవర్గం 64వ వార్డు కార్పొరేటర్, జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక నియోజవర్గం 64వ వార్డు యారాడ గ్రామం స్మశాన వాటికను 40లక్షలు రూపాయల నిధులతో సోమవారం శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం స్మశాన వాటిక యొక్క పరిసర ప్రాంతాల్లో పరిశీలించడం జరిగింది. ఇన్ని సంవత్సరాల కాలంలో స్మశాన వాటిక అభివృద్ధి జరుగుతున్నందుకు.. యారాడ గ్రామం ప్రజలు స్వచ్ఛంద నాయకులు గోవింద రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై దృష్టి సాధించేవాడు ప్రజల్లో ఉంటారని. ప్రజల శ్రేయస్ కోసం పాటుపడతారని.. ఆయన ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య, మెగా నూకరాజు, యారాడ జనసేన సీనియర్ నాయకులు సత్యాల నగేష్, బంక సాయికుమార్, పిళ్ళా వెంకటేష్, బంక అప్పారావు, గ్రామ పెద్దలు బంక సన్యాసిరావు, అచ్చిబాబు, రెడ్డి సన్యాసిరావు, బాయన శివ, సత్యాల పైడిరాజు, ఊరుకుటి సూర్యనారయణ మరియు గ్రామస్తులు వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.