రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన దారం అనిత
మదనపల్లి మండలంలో బార్లపల్లి దగ్గర బెంగళూరు నుండి మదనపల్లికి వస్తున్న భారతి ప్రవేట్ బస్సు గురువారం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ హాస్పటల్ లో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మదనపల్లె జనసేన నాయకులు గోపి, కిరణ్, హర్ష, సాగర్, మధు, రవీంద్ర, లక్ష్మణ్, ఆకుల శంకర తదితరులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.54.09-PM-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.54.10-PM-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.54.10-PM-1-1024x1024.jpeg)