కళ్యాణదుర్గం జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

కళ్యాణదుర్గం: జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాలతో 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దుస్థితిపై క్యాంపెనింగ్ లో భాగంగా “జనసేన-తెలుగుదేశం” పార్టీల ఆధ్వర్యంలో శనివారం బ్రహ్మసముద్రం మండలంలో బొమ్మగానిపల్లి నుండి కన్నేపల్లి వరకు గల రోడ్డులో నిరసన కార్యక్రమంను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి ఇంచార్జ్ వర్యులు ఉమామహేశ్వరనాయుడు గారు మరియు జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ రోడ్లు అద్వాన్న స్థితి గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీరాములు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, మండల నాయకులు రాయుడు, మంజునాథ్, నీలకంఠ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.