ఘనంగా దాసరి రాజు జన్మదిన వేడుకలు

ఇచ్ఛాపురం నియోజకవర్గం: ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు జన్మదినం సందర్భంగా సోమవారం వేడుకలు ఇచ్ఛాపురం జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని మహిమ గల తల్లి స్వేచ్చావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాసరి రాజు చేత కేక్ కటింగ్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిడ్నీ సమస్యపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్న సమయంలో కంచిలి మండలం కొండ పోలేరుకు చెందిన బోర కుర్రడు, కవిటి మండలంలోని గొండ్యాల పుట్టుగ కి చెందిన పుష్పలత 2 సంవత్సరాలుగా పెరాలసిస్ తో బాధ పడుతున్నప్పటికీ వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ రావట్లేదు అని చెప్పుకుంటూ కన్నీటి పర్యాంతం అయ్యారు. వారి బాధలు చూసి జనసేన పార్టీ తరపున ప్రతీ నెల ఒక్కరికీ 1000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తామని రాజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం వారి ఇద్దరికీ 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ జన్మదిన వేడుకల్లో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపళ్ళి ఈశ్వరరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్దులు, సర్పంచ్ అభ్యర్థులు, వీరమహిళలు, నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు భారీగా పాల్గొన్నారు.