కిడ్నీ వ్యాధి నిర్మూలనకు లక్ష సంతక సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దాసరి రాజు

ఇచ్చాపురం, సోంపేట మండలం జింకిబద్ర బెంకిలి గ్రామములో మంగళవారం జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున జనసైనికులు ర్యాలీతో వచ్చి జెండా అవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు మాట్లాడుతూ ఉద్దానంని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి నిర్మూలనకి లక్ష సంతకాలు సేకరణ చేసి ఒక కాపీ సీఎం, పీఎం, డబ్ల్యు హెచ్ ఓ మరియు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లకు ఇవ్వడానికి ప్రణాలళికను సిద్ధం చేశాంమని, కనుక ప్రతి జనసైనికుడు, జనసేన నాయకుడు, వీరమహిళలు పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరర్స్ తిప్పన దుర్యోధన, ఈశ్వర్, మత్యకార కార్యదర్శి నాగుల హరిబేహారా, కంచిలి జడ్పీటీసీ అబ్యర్ది శారదా ఈశ్వర్ గారు.కంచిలి ఎంపీటీసీ అభ్యర్ది సుశీల, హరిపురం సర్పంచ్ అభ్యర్ది నీలవేణి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.