టైక్వాండో అండర్ -14 జిల్లా స్థాయి సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి రాజు

ఇచ్చాపురంలో టైక్వాండో కోచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వైయస్సార్ కళ్యాణ మండపం ఆవరణలో బాల, బాలికలకు టైక్వాండో (కరాటే) అండర్ -14 జిల్లా స్థాయి సెలక్షన్ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్య ఎంత అవసరమో, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు కూడా అంతే అవసరమని, అందువల్ల ఈ రెండింటిని సమభాగంగా తీసుకొని వెళ్లినట్లయితే జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నత స్థానాన్ని పొందవచ్చునని అన్నారు. అలాగే వ్యాయామాలు, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి అన్నారు.