పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన దాసరి రాజు

మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం పట్ల ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షలో భాగంగానే వైసీపీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతోంది అని అన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన జనసేన-టీడీపీ బహిరంగ సభలో కూడా శ్రీనివాస్ అనే జనసేన పార్టీ వాలంటీర్ పై వైసీపీకి చెందిన కొంతమంది దాడి చేసి గాయపరిచడం వల్ల అతనికి 6 కుట్లు పడ్డాయని, ఆరోజు ఆ సభలో ఉండటం వల్ల వైసీపీ కుట్రలను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా నిర్వహించే బహిరంగ సభల్లో వైసీపీ మరిన్ని కుట్రలు పన్నే అవకాశం ఉందని, ఇలాంటి దాడులకు జనసేన పార్టీ భయపడేది లేదని, అధికారం ఉందని పోలీసుల ద్వారా సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి, మరో మారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే జనసేన-టీడీపీ కలిపి ఇక్కడి నుండే తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన ఇచ్చాపురం నియోజకవర్గం మున్సిపాలిటీ నాయకులు పాల్గొనడం జరిగినది.