నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన దాసరి రాజు

ఇచ్చాపురం: కవిటి మండలంలోని కొత్తపాలెం గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో శుక్రవారం ఆ గ్రామంలోని 16 మంది నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ తో పాటు (సరుకులుతో కూడిన కిట్టు) ఇచ్ఛాపురం జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తూ సామాన్యులను ఆదుకొనే మంచి కార్యక్రమాలు చేస్తున్న జనసైనికులకు అభినందనలు తెలిపారు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల కుటుంబాలకు బరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అని ప్రమాదవశాత్తూ చనిపోయిన జనసైనికులకి ప్రమాద భీమా రూ.5 లక్షలు వస్తుంది అని అన్నారు. అలాగే 2024లో రాబోయేది జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర్ రావు, జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, బడే రాజు, హేమా చలపతి, రాజశేఖర్, ధనుంజయం, రామ్మూర్తి, రవి, జోగారావు, ప్రేమ్ కుమార్, గ్రామపెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.