పవనన్న ప్రజా బాట 106వ రోజు

  • దిగ్విజయంగా కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు వీరబల్లి మండల నాయకుడు గుగ్గిళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో 106వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని వీరబెల్లి మండలంలోని గుర్రప్ప గారి పల్లె పంచాయతీలోని పలు గ్రామాలలో కొత్త వడ్డీపల్లి, ముప్పా వాండ్లపల్లి, తురకపల్లిలో, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. ఇప్పుడు ఉండే ప్రభుత్వం మా ఊరికి త్రాగునీరు కూడా అందించలేని ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి తప్పు చేశామని మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని ఈ వైసీపీ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మా ఊరికి ఎటువంటి డెవలప్మెంట్ గాని చేయలేదని ఓట్ల కోసం వస్తారు తప్ప ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని ఈ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే ఆ గ్రామంలో జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం వచ్చిందంటే మీ ఊరికి సహాయ సహకారాలు మా ప్రభుత్వంలో అందిస్తామని ఆ గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల నాయకులు గుగ్గిళ్ళ వెంకటేష్, కిషోర్, బాలకృష్ణ, లోకేష్, గంగయ్య, ప్రసాద్ జనసైనికులు పాల్గొన్నారు.