రాజాం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ 2వ రోజు

రాజాం: జనసేన పార్టీ &టీడీపి పార్టీ సంయుక్తంగా రోడ్లు పరిస్థితిపై రెండవరోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉంగరాడ మెట్ట వద్ద రోడ్లు దుస్థితిని తెలియజేసేలా జనసేన పార్టీ ఇంచార్జ్ ఎన్ని రాజుగారు , టీడీపి ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్ గారు నాయకులు కలిసికట్టుగా రోడ్లు పరిస్థితిని తెలియజేసేలా నిరసన తెలియజేశారు. గడిచిన 10 సంవత్సరాలలో స్థానిక ఎమ్మెల్యే రోడ్లు మరమ్మత్తు చేయలేని స్థితిలో ఉన్నారని తెలియజేస్తూ డిజిటల్ క్యాంపైనింగ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.