గ్రామ గ్రామానికి గాజుగ్లాస్ “టీ క్యాంప్” 2వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండలం, మెరకనపల్లి గ్రామంలో జనసంకల్ప యాత్ర టీం ఆధ్వర్యంలో “టీ క్యాంప్” మరియు మజ్జిగ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా జనసేన పార్టీ యువ నాయకులు వల్లభనేని అనుదీప్ గారు విచ్చేసి గ్రామస్థుల ఆధ్వర్యంలో “టీ క్యాంప్” కార్యక్రమం ప్రారంభించారు అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలను కలిసి గ్రామ ప్రధాన సమస్యలు తెలుసుకుని వాటిని ప్రజా ప్రభుత్వం రాగానే నెరవేరుస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.. దయ చేసి వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి గారికి మరియు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గారికి రెండు ఓట్లు గాజు గ్లాస్ కి వేసి గెలిపించండి అని గ్రామస్థులను అభ్యర్థించారు.. మన మండలంలో ఉన్న 13 గ్రామ పంచాయతీలల్లో ఈ టీ క్యాంప్ కార్యక్రమం మే 10వ తారీకు వరకు ప్రతి రోజు జరుగుతుంది.