జనంకోసం జనసేన మహాపాదయాత్ర రెండవ రోజు

రాజానగరం, రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో రెండవ రోజు పాదయాత్రలో భాగంగా ప్రతీ ఇంటికీ తిరుగుతూ, ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఈ దుర్మార్గపు దుష్ట వైస్సార్సీపీ పాలనను అంతమొందించి ప్రజా పరిపాలన సుపరిపాలన తీసుకురావడానికి మన తరువాతి తరాల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి మన జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించండి అని జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్ అందజేసిన జనసేన పార్టీ వీరమహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూషాదేవి అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.