పవనన్న చేనేత బాట 28వ రోజు
చీరాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “పవనన్న చేనేతబాట-చీరాల నియోజకవర్గం” 28వ రోజు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో శాంతి నగర్లో పర్యటించడం పూర్తయింది. కార్యక్రమంలో చేనేత కార్మికులు పడుతున్నా ఇబ్బందులను గుర్తించడం జరిగింది. ఇక్కడ సమస్యలను రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, రెండు చేనేత రంగం పరంగా ఎడురుకుంటున్న సమస్యలు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధుల సహకారంతో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. చేనేత రంగం పరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు చిల్లపల్లి శ్రీనివాసరావు ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నివేదించి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పింజల సంతోష్, తోట చక్రి, పసుపులేటి సాయి మరియు భూపతి మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-6.29.20-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-7.39.09-PM-846x1024.jpeg)