జనసేన ప్రజా చైతన్య యాత్ర 32వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి గిరడా అప్పలస్వామి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రజా చైతన్య యాత్ర 32వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం రామభద్రపురం మండలం, అరికితోట గ్రామం నందు ఎస్.సి కాలనీలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు గ్రామాల్లో ఇంటింటా పర్యటించి గ్రామ ప్రజల నుండి సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి సంతోష్, గౌరీ శంకర్, అచ్యుత, రవి, విజయ మరియు రామభద్రపురం, బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.