పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 34 వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా మూడవ విడత తిమ్మాజిపేట మండలం బుధవారం 34 వ రోజుగా కొడుపర్తి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులతో, జనసైనికులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు జనసేన పార్టీ విధి విధానాలను వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ మన దేశ భవితను మార్చగలిగే శక్తి ఉన్న యువకులు మారితేనే మన బ్రతుకులు మారతాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు మాది, అని విర్రవీగుతూ బహుజనుల అభివృద్ధి పక్కకు పెట్టి ప్రజలని మభ్య పెడుతూ వాళ్ల పబ్బం కలుపుకుంటున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వృద్ధులకు పించన్లు సరైన సమయంలోనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు, కల్వకుర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముకురాల కృష్ణ, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు సూర్య, మున్న సాయి, వంశీ రెడ్డి, ఎడ్ల ప్రసాద్, పవన్, ఎడ్ల రాకేష్, పూస శివ, ప్రవీణ్, శ్రీకాంత్, బాలు, చంద్రశేఖర్, జీవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.