అక్రమంగా తరలిస్తున్న మట్టి, గ్రావెల్ తవ్వకాలను అడ్డుకునే ఉద్యమం 4 వ రోజు

పిఠాపురం: గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో కోదండరాముని చెరువు నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి, గ్రావెల్ తవ్వకాలను అడ్డుకునే ఉద్యమం 4 వ రోజు సోమవారం అనగా ది: 03-07-2023 వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లా జనసేన అధ్యక్షులు కందులు దుర్గేష్, పిఎసి సభ్యులు పంతం నానాజీ, నియోజవర్గ జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి, పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, కడారి తమ్మయ్య నాయుడు, పిల్లా శ్రీధర్, వెన్నాపు చక్రరావు, వెన్నా జగదీష్ పాల్గొన్నారు. తోలేటి శిరీష తదితరులున్నారు.