పవనన్న ప్రజా బాట 42వ రోజు

వైజాగ్ సౌత్: దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
పవనన్న ప్రజా బాట కార్యక్రమం 42వ రోజుకు చేరుకుంది. దక్షిణ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వెళ్లిన ప్రతిచోట ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. 41వ వార్డు మరియు 39వ వార్డులో 42వ రోజు పవనన్న ప్రజా బాటలో భాగంగా ఇద్దరు వధువులకు మామిడి దేవికి మరియు వారణాసి ప్రవళిక కి పట్టుచీర, బంగారు తాళిబొట్టు, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మంచి కోరి తాను చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. తను ప్రజల మనిషినని, ప్రజల పక్షానే ఎప్పుడు ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వీరేంద్ర, రఘు, ప్రణీత్, తెలుగు అర్జున, ఆంటోనీ శేఖర్, ప్రసాద్, అనిల్, తెలుగు లక్ష్మీ, కుమారి, దుర్గ, అప్పారావు, వరద శ్రీను, కేదార్నాధ్, బదిరీనాధ్, గాజుల శ్రీను, రామారావు, రాజు, లలిత, మంగ తదితరులు పాల్గొన్నారు.