47 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి మండలం, అబ్బాపట్ల పల్లి, అబ్బాపట్ల పల్లి ఎస్టీ కాలనీ గ్రామాలలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో ఒక్క సిసి రోడ్డు కూడా వేయలేదని, త్రాగు నీరు కుళాయి ఇళ్ళకి లేదని, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, జనసైనికులు భారత్, కిరణ్, మురళి, చెంచయ్య, చిరంజీవి, భార్గవ్, బ్రంహయ్య, శివ, నాయకులు, తోట గణేష్, పేట చంద్ర శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, సురేష్, రాజేష్, గురవయ్య, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.