జనం కోసం జనసేన 543వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 543వ రోజు కార్యక్రమంలో లో భాగంగా పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం, వీరవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 89010 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 544వ రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కోరారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, వీరవరం గ్రామ అధ్యక్షులు పిడుగు జయబాబు, జీలకర్ర వెంకటరావు, కరణం కొండబాబు, మలిరెడ్డి విష్ణు, సామిరెడ్డి బాబురావు, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, భూపాలపట్నం సోము వేణుగోపాల్, జె. కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, సేనాపతి సాయి, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.