జన జాగృతి యాత్ర 56వ రోజు

  • జనసేన పార్టీ విజయకేతనానికి జన జాగృతి యాత్ర కీలక పాత్ర పోషిస్తుంది: గురుదత్
  • ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ జనసేన పార్టీ ఒక్క అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు: గంటా స్వరూప

రాజానగరం, జనసేన జనజాగృతి యాత్ర 56వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం గుమ్ములూరు గ్రామంలో 4వ రోజులో భాగంగా ఈ గ్రామంలో 400 గాజు గ్లాసులు ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 48,700వేల గాజు గ్లాసులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్రకార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ జన జాగృతి యాత్ర దిగ్విజయంగా 56 రోజుకు చేరుకుంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.